దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 56 కేసులు నమోదు కావడంతో తెలంగాణలో బాధితుల సంఖ్య 928కు చేరింది. ఇప్పటివరకూ 190 మంది డిశ్చార్జ్ కాగా 23 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడం కోసం పోలీస్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోంది. 
 
ఈరోజు ఉదయం సీపీ అంజనీకుమార్ తన ట్విట్టర్ ఖాతాలో "టుగెథర్ వి ఫైట్" అనే క్యాప్షన్ తో ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో ద్వారా పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు కరోనా కట్టడి కోసం ఎంతో కృషి చేస్తున్నారనే సందేశాన్ని ఇచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్న వీళ్లు రియల్ ఫైటర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 
మరికొందరు నెటిజన్లు మీ సేవలకు, త్యాగాలకు మా యొక్క ధన్యవాదాలు అంటూ ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: