కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. కొవిడ్-19నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా కొద్దిరోజుల కిందట ఆరోగ్యసేతు మొబైల్ యాప్ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోగ్య సేతు యాప్తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే మొదటి రోజే సుమారు 30లక్షల మంది దాదాని డౌన్లోడ్ చేసుకున్నారు. ఇందులో జాగ్రత్తలేగాకుండా.. మన చుట్టుపక్కల ఎవరైనా కొవిడ్-19 లక్షణాలు ఉన్నవారు ఉన్నారా..? అనే విషయంలో కూడా మనల్ని అలర్ట్ చేస్తుంది.
ఇక దీనిపై ప్రచారం చేయడానికి పలువురు సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్దేవ్గన్ కూడా ఈ యాప్న్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఇదే విషయంపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు. కరోనా నుంచి అప్రమ్తతంగా ఉండేందుకు హీరో అజయ్దేవ్గన్ కూడా ఆరోగ్యసేతు యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడంటూ ట్వీట్ చేశారు. ఇక యాప్గురించి అజయ్దేవ్గన్ వివరించే వీడియోను పోస్ట్ చేశారు.
Now @ajaydevgn is using @SetuAarogya app to stay alert from #COVID19. #SetuMeraBodyguard
— ravi shankar Prasad (@rsprasad) April 22, 2020
Download #AarogyaSetu now:
iOS: https://t.co/MRu7iuVIda
Android: https://t.co/zpiXUJcQeC pic.twitter.com/SDhqec6k8k