కరోనా కాలంలో జనాలను వినోద పరచడానికి సోషల్ మీడియాలో ప్రముఖ సినీ నటులు, క్రీడాకారులు, రాజకీయ ప్రముఖులు ఏదోక ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వీడియో లు ఎంత గానో అలరిస్తున్నాయి. తాజాగా ఒక సింగర్ ఇలాగే ఒక వీడియో చేసాడు. 

 

కరోనా లాక్ డౌన్  లో జనాలను వినోద పరచడానికి గానూ బిగ్ బాస్ లో కనిపించిన రోల్ రైడా అనే సింగర్ తన తోటి బిగ్ లో పాల్గొన్న పలువురి తో కలిసి ఒక పాటను రూపొందించాడు. బిగ్ బాస్ లో ఉండి వచ్చిన వారు అందరూ కూడా తలో చేయి వేసి ఈ వీడియో ని చేసారు. 'బిగ్‌బాస్‌' కంటెస్టెంట్‌లు గీతా మాధురి, నందిని రాయ్‌, భాను శ్రీ, శ్యామల, దీప్తి నల్లమోతు, దీప్తి సునయన, పూజా రామచంద్రన్‌, సంజన, తనీష్‌, అమిత్‌ తివారీ, సామ్రాట్‌, గణేశ్‌, కిరిటీలు ఇంటి పట్టునే ఉండండి.. క్షేమంగా ఉండండని మెసేజ్ ఇచ్చారు.

 

https://youtu.be/zqxRylH_N8U

మరింత సమాచారం తెలుసుకోండి: