ద‌టీజ్ చిరు.. స్వ‌యం కృషినే న‌మ్ముకుని మెగాస్టార్‌గా ఎదిగిన హీరో.. క‌ష్టం తెలిసిన వారే క‌న్న‌త‌ల్లిదండ్రుల‌ను కంటికిరెప్ప‌లా కాపాడుకుంటార‌ని చిరు మ‌రోసారి నిరూపించారు. లాక్‌డౌన్‌కార‌ణంగా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైన టాలీవుడ్ హీరోలు, ద‌ర్శ‌కులు త‌దిత‌ర ప్ర‌ముఖులు.. ఇటీవ‌ల *బీ ద రియ‌ల్ మ్యాన్‌* అంటూ ఓ ఛాలెంజ్‌ను మొద‌లుపెట్టారు. కానీ..చిరంజీవి మొద‌టి నుంచీ *బీ ద రియ‌ల్ మ్యాన్*‌గానే ఉంటున్నారు. రోజూ ఇంటిప‌నులు చేయ‌డం ఆయ‌నకు కొత్తేమీ కాద‌ట‌. అందుకే.. నిన్న జూనియ‌ర్ ఎన్టీఆర్ విసిరిన స‌వాల్‌ను చిరు స్వీక‌రించాడు. వంటింట్లో చ‌క్క‌గా దోష వేసి, అమ్మ‌కు తినిపించి.. క‌న్న‌త‌ల్లి అంటే త‌న‌కు ఎంత‌ప్రేమో ఈ ప్ర‌పంచానికి చూపించాడు. * నేను రోజూ చేసే ప‌నులే.. ఇవ్వాళ మీ కోసం ఈ వీడియో సాక్ష్యం* అంటూ ట్వీట్ చేశారు.

 

నిజానికి.. ఇప్ప‌టివ‌ర‌కు చాలామంది త‌మ ఇళ్ల ప‌నులు చేసి స‌తీమ‌ణుల మెప్పుపొందేందుకే ప్ర‌య‌త్నం చేశారు. *బీ ద రియ‌ల్ మ్యాన్ చాలెంజ్*‌ను స‌ర‌దా కిందే లెక్కేశారు.  కానీ.. చిరు మాత్రం ఇంటిప‌నులు చేసి.. దోషి వేసి.. అమ్మ‌కు తినిపించి.. అప్యాయంగా ముచ్చ‌ట్లు చెప్పిన వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది..! అంద‌రినీ ఒక్క‌సారిగా అమ్మ ఒడికి చేర్చారు చిరు..! క‌న్న‌కొడుకుల‌కు బాధ్య‌త‌ను గుర్తు చేశారు. ఇక‌ ఈ మీడియోను చూసిన వారు.. అమ్మంటే.. మెరిసే మేఘం.. పాట‌ను గుర్తు చేసుకుంటున్నారు. మ‌రికొంద‌రు ఎంతో భావోద్వేగంతో ట్వీట్లు చేస్తున్నారు. చిరు.. రియ‌ల్ మ్యాన్‌.. అంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. ద‌టీజ్‌.. చిరు!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: