ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీతో ఫోన్‌లో మాట్లాడారు. గుజరాత్‌లో చిక్కుకుపోయిన ఏపీకి మత్స్యకారులను సముద్ర మార్గం ద్వారా తరలించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు ఆయన గురువారం గుజరాత్‌ ముఖ్యమంత్రికి ఫోన్‌ చేశారు. అ లాగే మత్స్యకారులను తరలించేందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

 

కాగా పొట్టకూటి కోసం వలస వెళ్లి గుజరాత్‌లో చిక్కుకుపోయిన మత్స్యకారులను ఆదుకోవాలని, వారికి వసతి, భోజన సదుపాయం కల్పించాలని సీఎం జగన్‌ ఈ నెల 21న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే. సీఎం జగన్‌ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన విజయ్‌ రూపానీ తెలుగువారిని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. అయితే గుజరాత్‌లో చిక్కుకున్న మత‍్స్యకారులను   ప్రత్యేక బోటులలో సముద్ర మార్గం ద్వారా ఏపీకి తరలించడానికి గుజరాత్‌ ముఖ్యమంత్రి అంగీకరించారని న్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: