ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ ఇంట్లో విషాదం నెలకొంది. ఇవాళ ఉదయం నారాయణకు మాతృవియోగం కలిగింది. మాజీ మంత్రి తల్లి పొంగూరు సుబ్బమ్మ (85) మృతి చెందారు.  గత కొన్ని రోజులుగా సుబ్బమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు.. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీకి చెందిన నేతలు, పలువురు ప్రముఖులు నారాయణకు ఫోన్ చేసి పరామర్శించారు. 

 

కాగా రేపు సుబ్బమ్మ అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నారాయణకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు.  కొన్నేళ్ల కిందట నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం ఆయన్ని చాలా కృంగదీసిన విషయం.. తాజాగా మాతృవియోగం ఆయన్ని దుఖఃసాగరంలో ముంచివేసింది.  ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా సామాజిక దూరం పాటించాల్సి వస్తుంది.  మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: