ప్రపంచం మొత్తం కరోనా తో వణికి పోతుంది. ప్రతిరోజూ మరణాలు, కేసుల పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్  ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో క్రైమ్ రేట్ తగ్గిందని అంటున్నా కొన్ని చోట్ల మాత్రం ఆడవారిపై.. చిన్నారులపై  కృరమృగాళ్లు రెచ్చిపోతున్నారు.  తాజాగా మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో తన ఇంటి సమీపంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. దేశంలో లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరూ ఇంటి నుంచి బయటకు రావడం లేదు.  కన్నూ మిన్నూ కానరాకుండా ఓ దుర్మార్గుడు ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిపాడు.

 

ఈ ఘటనలో ఆ బాలిక తీవ్ర గాయాలపాలైంది.. అంతే కాదు కను గుడ్లు బయటకు వచ్చాయి.. బాలిక పరిస్థితి పూర్తి విషమంగా ఉంది.  బాలిక తన ఇంటికి దగ్గరగా స్నేహితులతో కలిసి ఆడుతుండగా ఆమెను గుర్తు తెలియని వ్యక్తి లాక్కుని వెళ్లాడు. అప్పటి నుంచి ఆ బాలిక కోసం తల్లిదండ్రులు వెతికారు.. ఓ చోట తీవ్ర గాయాలతో కంటిపై గాయాలతో బాలిక కనిపించింది.

 

బాలికపై అత్యాచారం జరిగినట్లుగా గుర్తించారు. ఆమె కళ్ళపై బలమైన గాయాలు ఉన్నట్లుగా సీనియర్ పోలీసు అధికారి హేమంత్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఆ బాలికపై అత్యాచారం చేసిన దుర్మార్గులను చంపేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: