దేశంలో కరోనా వైరస్ ని పూర్తిగా కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో అన్ని వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి.  ముఖ్యంగా సీనీ రంగంపై ఈ కరోనా ఎఫెక్ట్ ఘోరంగా పడింది.  షూటింగ్స్ ఆగిపోయాయి.. దాంతో సినీ కార్మికులు కష్టాల్లో పడ్డారు. అయితే వారిని ఆదుకునేందుకు అన్ని సినీ రంగాల వారు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికే  ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫేడరేషన్ ఆఫ్‌ సౌత్‌ ఇండియాకు రూ.50 లక్షలను విరాళంగా అందించిన సూపర్‌స్టార్‌ తాజాగా వెయ్యి మంది ఆర్టిస్ట్‌లకు సాయం చేయనున్నారు.

 

ఈ మేరకు రజనీ నడిగర్‌ సంఘంలో సభ్యులుగా ఉన్న 1000 మంది ఆర్టిస్ట్‌లకు నిత్యావసరాలను అందించనున్నారు.  కాగా, రజనీకాంత్ ఫ్యాన్స్ క్లబ్ సభ్యులు కూడా తమ వంతు సాయం అందిస్తున్నారు. మరోవైను టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సీసీసీ ద్వారా విరాళాలు స్వీకరిస్తూ ఎంతో మంది సినీ కార్మికులకు దగ్గరుండి సహాయ సహకారాలు అందిస్తున్నారు.  టాలీవుడ్ లో ఎంతో మంది ఆయనకు అండగా ఉంటున్నారు.. అంతే కాదు బిగ్ బీ అమితాబచ్చన్ కూడా విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: