ఒకప్పుడు టెలివిజన్ రంగాన్ని ఒక్క ఊపు ఊపిన దారావహికాలు రామాయణం, మహాభారత్. ఆదివారం వచ్చిందంటే చాలు చిన్నా పెద్ద అందరూ టీవిల ముందు కూర్చునేవారు.  ఎంతో ఉత్సాహంగా ఈ సీరియల్స్ వీక్షించేవారు.  అంత గొప్ప సీరియల్స్ మళ్లీ తెరపై చూడలేకోయాం అనుకుంటున్న సమయంలో లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సీరియల్స్ మళ్లీ పునఃప్రసారం అవుతున్నాయి.  అప్పట్లో ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ లేదు. తాజాగా ఆ సీరియల్ లో ఎవరూ గుర్తించిన తప్పులను నేటి తరం ప్రేక్షకులు ఈజీగా కనిపెట్టేశారు.

 

ఎపిసోడ్ లో భీష్ముడి పక్కన ఎయిర్ కూలర్ కనిపించగా, ప్రేక్షకుల ఇట్టే పట్టేశారు.  ఇంకేముందు ఈ ఫోటో షేర్ చేస్తూ ఫన్నీకామెంట్స్ పెడుతున్నారు.  అప్పట్లో ఈ సీరియల్స్ చాలా వరక బ్లాక్ అండ్ వైట్ టివిల్లో చూసేవారు.  చాలా కాలం తర్వాత ఈ సీరియల్స్ ప్రసారం కావడం ఒకంత ఆనందంగా ఉందంటున్నారు.

 

అంతే కాదు ఈ సీరియల్స్ ప్రసారం తర్వాత దూరదర్శన్ రేటింగ్స్ కూడా పెరిగిపోతుంది.  అయితే  నెటిజన్లు ఇంగ్లీషు టెలివిజన్ సీరిస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎపిసోడ్ లో జరిగిన తప్పిదాన్ని కూడా ప్రస్తావించారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కాఫీ కప్ కనిపించడం ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది. ఈ రెండింటిని కలిపి నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు గుప్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: