కొవిడ్‌-19  ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది.  లాక్ డౌన్ నేపథ్య‌౦లో ఇళ్ల‌కే ప‌రిమితం అవ్వ‌డంతో ప్రజలంతా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ప డుతు న్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. చాలామంది ఉపాధిని కోల్పోయారు. దిన‌స‌రి, వ‌ల‌స కూలీలైతే ఒక్క పూట అన్నం దొరక్క క‌ష్టాలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ భారతీయుడిని అదృష్ట లక్ష్మి వరించింది. అతడు భారీ లాటరీని గెలిచాడు. 

 


దుబాయ్‌లోని ఎమిరేట్స్‌ లోటో ప్రారంభోత్సవ డ్రాలో అతడు విన్నర్‌గా నిలిచాడు. దీంతో 350,000 దిరామ్ లను ఆయన గెలుచుకున్నారు. అంటే ఇండియన్ రూపాయి ప్రకారం దాదాపు రూ.72 లక్షలు. దీంతో ఇప్పుడు ఆ వ్యక్తి దుబాయ్ లో హాట్ టాపిక్ గా మారారు. తన దగ్గరున్న టికెట్లోని ఆరు నంబర్లు కలవడంతో.. తాను షాక్‌ తిన్నట్లు మహమ్మద్ ఖలీద్ అన్నారు. పదేళ్ల క్రితం దుబాయ్‌కు వెళ్లిన ఆ వ్యక్తి.. ప్రస్తుతం అక్కడ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఇక ప్రైజ్‌ మనీ వచ్చిన తరువాత ఆ వ్యక్తి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆ మొత్తంలో కొంత భాగాన్ని తన కుటుంబానికి పంచారు. అంతేకాదు యూఏఈ వైస్‌ ప్రెసిడంట్, ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు 10 మిలియన్ రమదాన్ మీల్స్‌ కార్యక్రమానికి తన వంతు సాయాన్ని అందిస్తానని చెప్పి, పెద్ద మనసుకు చాటుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: