దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ అత్యాచార కేసులు నింధితులకు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. కాస్త లేట్ అయినా న్యాయం మాత్రం జరిగింది.. అన్యాయంగా ఓ ఆడకూతురని దారుణంగా అత్యాచారం చేసి ఆమె చావుకు కారణం అయిన వారు అంతమయ్యారు.  ఇటీవల తెలంగాణ దిశ ని అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నింధితులు ఎన్ కౌంటర్ అయ్యారు.  ఇలా ఆడవారిపై అఘాయిత్యం చేసిన వారు ఏదోరకంగా పాపం అనుభవిస్తున్నా కొంత మంది దుర్మార్గులో మాత్రం భయం ఏమాత్రం లేకండా పోతుంది.  తాజాగా మతిస్థిమితం లేని బాలికపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ శివారులోని కుత్బుల్లాపూర్‌ ప్రాంతంలో జరిగింది. 

 

బాధిత బాలిక రోడామిస్త్రీనగర్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తించిన అదే ప్రాంతానికి చెందిన యువకులు అక్బర్, జుమన్, గయాజ్, అలీంలు ఆ బాలిక నోరు మూసి బలవంతంగా పాడు బడ్డ భవనంలోకి తీసుకు వెళ్లి అత్యాచారం చేశారు.  అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత బాలికకు ఫోన్ ఇచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడించారు.  బాలిక తల్లిదండ్రులు దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 

బాలిక నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు రెండు గంటల తర్వాత దేవేందర్‌నగర్‌లో బాలికను గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలంలోకి చేరుకోగానే నింధితులు పారిపోయేందుకు ప్రయత్నించగా వారిలో ఒకరిని పట్టుకున్నారు పోలీసులు.  అతుడు ఇచ్చిన సమాచారం మేరకు  మిగతా ముగ్గురిని కూడా ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: