టాలీవుడ్లో ఎవ్వరూ ఊహించని విధంగా తనకంటూ తిరుగులని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్న పవన్ వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మొఘలుల కాలం నాటి కథాంశంతో రూపొందనుంది.
ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్గా ముందు బాలీవుడ్ భామ జాక్విలిన్ పేరు వినబడగా, ఆ తరువాత కీర్తి సురేశ్ పేర్లు వినిపించాయి. కానీ తాజాగా నివేదా పేతురాజ్ ని పవన్ సరసన ఫిక్స్ చేశారని సమాచారం. నివేదా పేతురాజ్ మంచి పొడగరి కావడం వలన, పవన్ కి జోడీగా సెట్ అవుతుందని భావించిన దర్శక నిర్మాతలు నివేదా పేతురాజ్ ని ఖరారు చేసినట్లు సమాచారం.