టాలీవుడ్‌లో ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే అది క‌చ్చితంగా *బీ ద రియ‌ల్ మ్యాన్* ఛాలెంజేన‌ని చెప్పొచ్చు. రోజురోజుకూ దీనికి య‌మ‌క్రేజీ ఏర్ప‌డుతోంది. ఇలా స‌వాల్ విస‌ర‌డ‌మే ఆల‌స్యం.. అలా స్వీక‌రిస్తున్నారు. స్టార్ హీరోలు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇందులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నిన్న హీరో వెంక‌టేశ్ విసిరిన స‌వాల్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి స్వీక‌రించారు. *ఇంట్లో వాళ్ళకి కొంత ఫ్రస్ట్రేషన్ రిలీఫ్. మనకి కొంత ఫన్* అంటూ ఇంటి ప‌నులు చేశాడు. ముందుగా బోళ్లు తోమి క‌డిగాడు. ఆ త‌ర్వాత ఇళ్లంతా తుడిచాడు. ఆ త‌ర్వాత‌.. దుప్ప‌ట్లు మ‌డ‌తేసి, కూర‌గాయలు క‌ట్ చేశాడు. ఇంటి ఆవ‌ర‌ణ‌లోని మొక్క‌ల‌కు నీళ్లు పోశాడు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఇక్క‌డ ఆయ‌న మ‌రో ముగ్గురిని నామినేట్ చేశాడు. నంద‌మూరి క‌ల్యాణ్‌, సాయిధ‌ర‌మ్‌తేజ‌, ర‌వితేజ‌కు స‌వాల్ విసిరాడు.

 

దీనిపై వెంట‌నే సాయిధ‌ర‌మ్‌తేజ స్పందించాడు. ఆహా.. ఓకే డ‌న్ అనిల్ రావిపూడి అన్నా.. అంటూ ట్వీట్ చేశాడు. మ‌రి ఈ హీరో ఎలాంటి వీడియోను పోస్ట్ చేస్తాడో చూడాలి మ‌రి. అయితే.. ఇప్పుడు హీరో ర‌వితేజ ఎప్పుడు.. ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి. అంత‌కుముందు జూనియ‌ర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవి, హీరో వెంక‌టేశ్‌ల‌కు ఛాలెంజ్‌ను విసిరిన విష‌యం తెలిసిందే. ఇక చిరంజీవి వీడియో విడుద‌ల చేసేముందు వెంకీ మామా.. ఐయామ్ కమింగ్ అంటూ ఓ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ఆ  కొద్దిసేప‌టికే ఇంటిప‌నులు చేసి, పెస‌ర‌ట్టు ఉప్మాను త‌యారు చేసి త‌ల్లికి తినిపించిన వీడీయోను పోస్టు చేశారు. ఇక ఆ త‌ర్వాత వెంక‌టేశ్ కూడా వీడియోను పోస్ట్ చేసి అనిల్‌రావిపూడికి స‌వాల్ విసిరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: