ఆంధ్రప్రదేశ్లో కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని పటిష్ట చర్యలు తీసుకుంటున్నా... చాపికంద నీరులా విస్తరిస్తోంది. ప్రతి రోజు కొత్తగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇవాళ కొత్తగా 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
ఈకొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1016కి చేరుకున్నాయి. వైరస్ బారిన పడి గడిచిన 24 గంటల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 31 చేరడం గమనార్హం. ఇప్పటి వరకు 171 మంది దవాఖానల్లో చికిత్స పొంది డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.