దేశంలో ఓ వైపు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతున్న కరోనా మహ్మారి వల్ల కేసులు పెరిగిపోతున్నారు. వాటితో పాటు మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది.  ఈ సమయంలో ఎవరు మరణించినా రక రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి.  తాజాగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు వాళ్ల ఇంట్లోనే అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శనివారం ఉదయం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇతాహ్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన కోత్వాలీ పోలీసు స్టేషన్‌నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని గ్రాండ్‌ ట్రంక్ రోడ్డు.. శ్రీనగర్ కాలనీలో జరిగింది.   

 

వైద్య శాఖలో క్లర్క్‌గా పని చేసి రిటైరైన రాజేశ్వర్ పచౌరీ(75)తో పాటు అతని కుటుంబసభ్యులు దివ్య పచౌరీ(33), బాబుల్(25), దివ్య కుమారులు ఆరుశ్(10), లాలూ(1)గా గుర్తించారు.  వీరంగా విషయం తీసుకొని ఆత్మమత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

 

చనిపోయే ముందు ఇంట్లోకి బలవంతంగా ఎవరూ రాలేదు.. మృతదేహాల పక్కన టాయిలట్ క్లీనర్‌తో పాటు.. విషం కూడా లభించిందని పోలీసులుతెలిపారు.  డాగ్ స్క్వాడ్ సహాయంతో ఘటన స్థలంలో వేలి ముద్రలు సేకరించామని. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించి బంధువులకు సమాచారం అందించామని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: