పరస్త్రీ వ్యామోహం ఎంత దయనీయమైన స్థితికి తీసుకెళుతుందో ఈ ఘటన మనకు తెలియజేస్తుంది. భార్య బిడ్డలతో సరదాగా సాగిపోతున్న అతని జీవితంలో అతని పక్కచూపుల కారణంగా తన జీవితాన్ని తనకు తానే అంతం చేసుకున్న దుర్ఘటన ప్రకాశం జిల్లా కొమరోలులో జరిగింది. పరాయి స్త్రీ తో సంభందం భార్యకు తెలిసి భార్య నిలదీయడంతో భయపడిన అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  అయన ఓ ఇంటి  యజమాని అతనికి కొడుకు ,కూతురు మరియు భార్య ఉన్నారు.  

 

వివరాలలోకి వెళితే ప్రకాశం జిల్లా కొమరోలులో దూదేకుల మస్తాన్‌(36)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతడికి కొంతకాలం క్రితం ఓ వేరే స్త్రీ తో అక్రమ సంభందం పెట్టుకున్నాడు. ఈ విషయం అతని భార్యకు తెలియడం తో అతడిని నిలదీసింది. కానీ అతను ఆ సంభందాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు. అతని భార్య పెద్దమనుషుల్లో పెడతానని చెప్పినాకూడా మాటవినలేదు. అయితే ఆఖరిగా తనిపై పోలీస్ కేసు పెడతానని చెప్పడం తో .

 

కొద్దిరోజులుగా ఆందోళన చెందుతున్నాడు. ఈ భయం కారణంగా నే అతడు శుక్రవారం గిద్దలూరు వచ్చి పురుగుల మందు తాగేశాడు. ఈ విషయాన్నీ తెలుసుకున్న మస్తాన్‌ భార్య ఖాసీంబీ అతడిని గిద్దలూరులోని  ఓ ప్రయివేట్ హాస్పిటల్ కి తరలించింది. కానీ పరిస్థితి విషమించడం తో అతడిని ఒంగోలు కి తరలిస్తుండగా చీమకుర్తి సమీపంలో అతడు ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్నీ మస్తాన్‌ భార్య ఖాసీంబీ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. పోలీస్ లు కేసు నమోదు చేసి అతని ప్రియురాలు మరియు ఆమె కుటుంబ సభ్యులను విచారణ చేస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: