మెగా బ్రదర్స్ లో నాగబాబుది భిన్నమైన శైలి. ఏ విషయంలోనైనా నాగబాబు ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా తన మనస్సులోని అభిప్రాయాలను మొహమాటం లేకుండా వెల్లడిస్తారు. చిరు, పవన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే వారు స్పందించకపోయినా నాగబాబు మాత్రం తప్పనిసరిగా స్పందిస్తారు. తాజాగా నాగబాబు ఒక సంచలన ప్రకటన చేసి వార్తల్లో నిలిచారు. 
 
సినీ నటుడిగా, రాజకీయ నాయకునిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగబాబు ఏ విషయంపైనైనా స్పందించాలనుకుంటే వెంటనే స్పందిస్తారు. నాగబాబు గుళ్లు, మసీదులు, చర్చీలు కాదు అన్నం పెట్టేది మనం రెండు చేతులు ఎత్తి డాక్టర్లకు, శాస్త్రవేత్తలకు దండం పెట్టాలని అన్నారు. ఈ పోస్టుపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ పోస్టుపై విమర్శలు వచ్చినా నాగబాబు ఆ విమర్శలపై స్పందించలేదు. 
 
నిజానికి నాగబాబు ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా గుళ్లు, మసీదులు, చర్చీలు మూతబడ్డాయని... కరోనా నుంచి శాస్త్రవేత్తలు, వైద్యులే మనల్ని రక్షిస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కానీ కొందరు మాత్రం ఆ పోస్టును మతపరమైన విద్వేషం అని కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఆయన మరో పోస్ట్ చెసి సృజనాత్మకమైన స్టేట్ మెంట్ ఇచ్చారు. 
 
కేవలం హిందువులు మాత్రమే ఇతర మతస్థుల ఆచారాలను, వ్యవహారాలను గౌరవించడం పరమత సహనం అనిపించుకోదు. ఇతర మతస్థులు కూడా హిందువుల ఆచారాలను, వ్యవహారాలను గౌరవించుకోవడం పరమత సహనం అనిపించుకుంటుంది. మరి నాగబాబు చేసిన ఈ పోస్ట్ గురించి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతాయో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: