తెలంగాణ రాష్ట్ర సాధ‌నే ధ్యేయంగా ఏర్ప‌డి, క‌ల‌ను సాకారం చేసిన‌ తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ నేడు 20 ఆవిర్భావ దినోత్స‌వం జ‌రుపుకుంటోంది. పార్టీ ఏర్ప‌డిన నాటి నుంచి నేటి వ‌ర‌కు ఎదురైన స‌వాళ్లు, సాధించిన విజ‌యాల‌ను గుర్తు చేసుకుంటున్నా పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు. అయితే.. కరోనా వైర‌స్ కార‌ణంగా పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని అత్యంత నిరాడంబ‌రంగా జ‌రుపుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇదేస‌మ‌యంలో ప్ర‌తీ ఒక్క‌రు సామాజిక‌దూరాన్ని పాటించాల‌ని కోరారు. ఇక ఇదేస‌మ‌యంలో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్వేభ‌పూరిత‌మైన ట్వీట్ చేశారు.

 

*ఒక్క పిడికిలి బిగిస్తే బిగుసుకున్నయ్ కోట్ల పిడికిల్లు.. ఒక్క గొంతు జైకొడితే జంగు సైరనయ్యింది.. స్పూర్తి ప్రదాతా వందనం ...ఉద్యమ సూర్యుడా వందనం.. పార్టీ 20 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యమ బిడ్డలందరికీ ఆవిర్భావ దినోత్సావ శుభాకాంక్షలు.. జై తెలంగాణా ! జై జై కేసీఆర్ !!* కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. మా త‌రంలో చూసిన విప్ల‌వ వీరుడు కేసీఆర్ అంటూ కొనియాడుతున్నారు ప‌లువురు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: