కరోనా వ్యాప్తంగా ప్రపంచంలో చాలా మంది మృతిచెందుతున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రెండు లక్షల మంది మృతిచెందారు. ఇక కరోనా దెబ్బతో సామాన్యులు లేరు రాజకీయ నాయకులు లేరు..ఎవరైనా ప్రాణాలు వదలాల్సిందే. తాజాగా మన దేశంలో కరోనాతో తొలి పొలిటికల్ డెత్ నమోదు అయ్యింది. కరోనా భారీన పడిన ఓ రాజకీయ నాయకుడు మరణించారు. గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, అహ్మదాబాద్ కార్పొరేటర్ బద్రుద్దీన్ షేక్ ఆదివారం రాత్రి మరణించారు.
బద్రుద్దీన్ కాంగ్రెస్లో 40 సంవత్సరాలుగా పనిచేశారు. 68 సంవత్సరాల బద్రుద్దీన్ షేక్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్గా పని చేశారు. అహ్మదాబాద్లోని బెర్హంపూర్ వార్డు నుంచి ఆయన కార్పొరేటర్గా గెలుస్తూ వచ్చారు. కరోనా వైరస్తో రాజకీయ నాయకులకు... పెద్దలకే రక్షణ లేకుండా పోయిందని.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని బీజేపీపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple