వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఈరోజు ఉదయం నుంచి చంద్రబాబును, ఆయన అనుకూల మీడియాను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. 2019లో చంద్రబాబు అధికారం కోల్పోయే నాటికి రాష్ట్ర ఖజానాలో 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఏపీలో కరోనా వల్ల లాక్ డౌన్ అమల్లో ఉండటంతో రాష్ట్రానికి రాబడి పూర్తిగా తగ్గిందని అన్నారు. 
 
రాష్ట్రంలో మరో రెండు మూడు నెలలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ లో రాష్ట్ర ప్రజలు ఎవరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్ అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించారు. సీఎం జగన్ రాష్ట్రానికి ఆదాయం తగ్గుతున్నా ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంత చేస్తున్నా పచ్చ మాఫియా మాత్రం ఏడుస్తూనే ఉందని కామెంట్లు చేశారు. 
 
అందరు సీఎంలు కరోనాను ఎదుర్కోవడానికి పోరాడుతుంటే సీఎం జగన్ కరోనాతో పాటు ఎల్లో వైరస్ తో పోరాడుతున్నాడని అన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: