ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను కొవిడ్‌-19 అత‌లాకుత‌లం చేస్తోంది.  రాష్ట్రంలో కరోనా వైర‌స్ మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పె రిగిపోతుండటంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడచిన 24 గంటల్లో (ఆదివారం ఉదయం 9:00 గంటల నుంచి సోమవారం ఉదయం 9:00 గంటల వరకు) కొత్త‌గా 80 కేసులు నమోదయ్యాయని ఏపీ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. 

 

ఈ కొత్త కేసులతో కలిపి ఏపీలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1177కు చేరుకుంది. గుంటూరు జిల్లాలోనే అత్య‌ధికంగా  పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. జిల్లాలో కొత్త‌గా 23 కేసులు న‌మోద‌వ‌డం గ‌మ‌నార్హం. ఇక కృష్ణా జిల్లాలో 33, కర్నూలులో 13, నెల్లూరులో 07, పశ్చిమ గోదావరిలో 03, శ్రీ కాకుళం జిల్లాలో ఒక్క కేసు నమోదైన‌ట్లు ఏపీ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ వెల్లడించింది. కాగా ఇప్ప‌టికే క‌రోనా తో రాష్ట్ర‌వ్యాప్తంగా 31 మంది చ‌నిపోయారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: