యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. అయితే ప్ర‌స్తుతం లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఈ సినిమా షూటింగ్ ఆగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మ‌రో యువ హీరో న‌టించ బోతున్నాడ‌ట‌. ఈ సినిమాలో బాల‌య్య‌కు అసిస్టెంట్ రోల్ ఉంటుంద‌ట‌. ఈ రోల్‌లో  ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌’ హీరో న‌వీన్ పొలిశెట్టి క‌నిపించ‌బోతున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. 

 

ఈ సినిమాలో మొత్తం ఇద్ద‌రు హీరోయిన్లు ఉంటార‌ని.. ఇందులో ఒక కొత్త హీరోయిన్ న‌టించ బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఏక‌ధాటిగా జ‌రిగే సింగిల్ షెడ్యూల్‌లో ఫినిష్ చేసి ద‌స‌రాకు రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని అందులో ఓ పాత్ర అఘోరా పాత్ర అని టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: