దేశంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న కరోనా  వైరస్ కేసుల దృశ్య కేంద్ర ప్రభుత్వం ఒక్క సారి లాక్ డౌన్  పొడిగించిన విషయం తెలిసిందే. అయితే మే మూడు వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఇప్పటికీ దేశంలో కరోనా  వైరస్ ప్రభావం ఎక్కడ తగ్గకపోవడంతో లాక్ డౌన్  పొడిగించే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. తాజాగా అందరూ అనుకున్నదే అయింది. తాజాగా దేశంలోని అందరి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ... లాక్ డౌన్  పొడిగించాలా వద్దా అనే దానిపై అందరు ముఖ్యమంత్రుల అభిప్రాయాలు సేకరించారు. అందరూ ముఖ్యమంత్రులు లాక్ డౌన్  పొడిగించేందుకు ఓటు వేసినట్లు తెలుస్తోంది. దీంతో మరో పదిహేను రోజుల పాటు లాక్ డౌన్  పొడిగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. వీడియో కాన్ఫరెన్స్ లో మొత్తం తొమ్మిది మంది సీఎం లు పాల్గొన్నారు. నలుగురు సీఎంలు లాక్ డౌన్ పొడగింపుకే  ఓటేయగా ప్రధాని మోడీ  కూడా పొడగింపుకే  మొగ్గు చూపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: