ప్రచారం జోలికి వెళ్ల‌కుండా..  పబ్లిసిటీకి దూరంగా ఉంటూ ఎంతో మంది కడుపు నింపుతోంది హీరోయిన్ ప్రణితా సుభాష్.  నిండు మనసుతో ఆమె చేస్తున్న సహాయం అందరి హృదయాలను గెలుచుకుంది. `అత్తారింటికి దారేది` సినిమాతో తెలుగునాట గుర్తింపు దక్కించుకుంది క‌న్న‌డ హీరోయిన్‌ ప్రణిత. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలిచేందుకు సహాయపడుతోంది. 

 

ఇప్పటికే ఆర్థిక సహాయం ప్రకటించిన ప్రణిత.. లాక్‌డౌన్ కష్టాలు మరింత పెరిగాక పేదలను ఆదుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగింది. స్వయంగా భోజనం వండిస్తూ వాటిని పంపిణీ చేయిస్తోంది. గత 21 రోజుల్లో ఏకంగా 75 వేల మందికి భోజనం పెట్టింది. ప్రణిత మంచితనం నెటిజన్లను ఆకట్టుకుంది. ఆమె నిజమైన సెలబ్రిటీ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. సెలబ్రిటీల నుంచి సమాజానికి కావాల్సింది పిల్లో ఛాలెంజ్‌లు, రియల్ మేన్ ఛాలెంజ్‌లు కాదు.. ప్రణితలా నిండు మనసుతో చేసే ఫుడ్ ఛాలెంజ్ కావాలని కామెంట్లు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: