తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయని మరియు రాష్ట్రంలో ఇవాళ రెండు కేసులు మాత్రమే నమోదు కావడం శుభ పరిణామమే అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అయితే గడచిన 24  గంటల్లో 2 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. అయితే ఆ రెండు కేసులు కూడా హైద్రాబాద్ ghmc పరిధిలోనే నమోదు కావడం జరిగింది. తెలంగాణ లో పాజిటివ్ కేసులు తగ్గడం శుభపరిణామం అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు అయితే తెలంగాణ లో ఉన్న 24 జిల్లాల నుండి ఒక్క కేసుకూడా నమోదు కాలేదని అయన పేర్కొన్నాడు.

 

IHG

 

అయితే రాబోయే రోజుల్లో కరోనా రహిత రాష్ట్రము గా తెలంగాణను చూడబోతున్నామని అయన ఆశాభావం వ్యక్తం చేశాడు. గడిచిన 24 గంటల్లో నమోదైన రెండు కేసులను కలుపుకొని తెలంగాణా వ్యాప్తంగా 1003 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇప్పటి వరకు 25 మరణాలు సంభవించాయి అవికూడా హైదరాబాద్ పరిధి నుండి మరియు మర్కజ్ నిజాముద్దీన్ సంఘటనల కారణం జరిగినవే. 646 యాక్టీవ్ కేసులు ప్రస్తుతం ఉన్నాయ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: