కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మంగళవారం ఉదయం వరకు ఉన్న అప్డేట్స్ చూస్తే కరోనా బాధితుల సంఖ్య 30 లక్షలు దాటేసింది. కరోనా మరణాలు 2.11 లక్షలు దాటేశాయి. ఇక కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 9.22 లక్షలు ఉంది. అగ్ర రాజ్యం అమెరికాలో కేసులే 10 లక్షలు దాటగా... మరణాల సంఖ్య 55 వేలకు పైనే ఉంది. అనధికారికంగా ఇవి మరింత ఎక్కువే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇక మనదేశంలో మంగళవారం ఉదయం 8 గంటల వరకు ఉన్న అప్డేట్స్ చూస్తే కరోనా కేసులు 29, 435కు చేరుకున్నాయి. కరోనా మరణాలు 934 గా నమోదు అయ్యాయి. ఇప్పటకీ కూడా యాక్టివ్ కేసులు 21, 632 ఉండగా... డిశ్చార్జ్ అయిన వారు 6868గా ఉన్నారు. ఏదేమైనా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువే అవుతున్నాయి. అదే టైంలో కరోనా మరణాలు కూడా వెయ్యికు చేరువ అవుతుండడం అందరిని ఆందోళన పరుస్తోంది.