క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. దేశంలోనే అత్య‌ధిక క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలుస్తోంద‌ని అధికార వైసీపీ నేత‌లు అంటుంటే.. ప్ర‌తిప‌క్ష టీడీపీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ప‌లువురు నాయ‌కులు మాత్రం అస్స‌లు ఒప్పుకోవ‌డం లేదు. క‌రోనా క‌ట్ట‌డిలో వైసీపీ స‌ర్కార్ విఫ‌లం చెందింద‌ని, స‌రైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదంటూ ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. అయితే.. వైసీపీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి మాత్రం ట్విట్ట‌ర్ వేదిక‌గా బాబోరి బ్యాచ్‌కి గ‌ట్టిగానే చుర‌క‌లు అంటిస్తున్నారు. నిరంత‌రం ప్ర‌తిప‌క్ష‌ల నేత‌ల విమ‌ర్శ‌ల‌కు అదిరిపోయే కౌంట‌ర్ ఇస్తున్నారు.

 

తాజాగా.. బోబోరి బ్యాచ్‌పై విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి ట్వీట్ చేశారు. *అజ్ఞానం, మూర్ఖత్వం ఆవహించిన వీళ్లు మంత్రులుగా బాబు హయాంలో మేధావులమని బిల్డప్ ఇచ్చేవారు. కరోనాపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. టెస్టులు ఎక్కువ చేసి చూపించడమేంటి? వ్యాధి విస్తరణకు ప్రభుత్వం కారణమవడమేంటి?  కరోనా గురించి ట్యూషన్ పెట్టించుకునైనా తెలివి పెంచుకోండయ్యా!* అంటూ ఎద్దేవా చేశారు. ఇక ఈ ట్వీట్‌పై టీడీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: