దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో ప్రజలందరినీ ఇంటికి పరిమితం చేసి అవగాహన కల్పించేలా పోలీసులు కీలక పాత్ర వహిస్తున్న విషయం తెలిసిందే. కానీ కొన్నిసార్లు మాత్రం ఏకంగా పోలీసుల పైన అతి దారుణంగా దాడికి దిగుతున్నారు ప్రజలు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా ఇలాంటి ఘటన జరిగింది. లాక్ డౌన్ అమలు చేయడానికి రహదారిపై గుంపులు గుంపులు గా ఉన్న జనాన్ని క్లియర్ చేయడానికి వెళ్లిన పోలీసులపై ... హౌరా లోని టిపారాల్లో లో ఒక ప్రాంతంలో రాళ్లతో దాడికి దిగారు అక్కడ జనాలు. ఏకంగా పోలీసులు సైతం భయాందోళనకు గురి అయ్యేలా ప్రవర్తించారు, పోలీస్ స్టేషన్ పై దాడి చేసి రెండు పోలీసు వ్యాన్ లను కూడా ధ్వంసం చేశారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
😡Mob attacked Cops with Stones and vandalised 2 police Vans, in Tikiapara a red ZONE area in Howrah when they went to clear crowd on the road to implement the lockdown pic.twitter.com/7aZ2YWoQ91
— akshay Singh (@Akshaysinghel) April 28, 2020