తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలయ్యకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మద్య తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ తీసి భారీ డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘రూలర్’ మూవీతో మరో డిజాస్టర్ అందుకున్నాడు. దాంతో ఈసారి మంచి హిట్ కొట్టాలని గతంలో తనకు సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన బోయపాటినే నమ్ముకున్నాడు.  ఈ నేపథ్యంలో బోయపాటి - బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతుంది. ఈ మూవీలో బాలయ్య పక్కన ఓ యంగ్ హీరో ఉంటాడని.. అతని పాత్ర ఈ మూవీలో చాలా కీలకం అని ఈ మద్య వార్తలు వచ్చాయి.

 

హీరో ఎవరో కాదు.. ఈ మద్య ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' ఫేమ్ నవీన్ పోలిశెట్టి అని అంటున్నారు.  ఈ మూవీ సక్సెస్ అయితే మనోడి లైఫ్ మారిపోతుందని తెగ వార్తలు వచ్చాయి. తాజాగా బోయపాటి సినిమాకి సంబంధించి ఇంతవరకూ నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఈ సినిమాలో నేను చేయనున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. అదంతా కేవలం పుకారు మాత్రమే  అంటూ జోరుగా జరుగుతున్న ప్రచారానికి ఆయన తెరదించేశాడు.

 

 కాగా, కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకునే నవీన్, తాజాగా 'జాతిరత్నాలు' అనే చిత్రంలో నటించాడు. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా థియేటర్స్ కి రానుంది. ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని.. తప్పకుండా ప్రేక్షకుల మనసు దోచుకుంటుందని ఈ యంగ్ హీరో అంటున్నాడు.  మొత్తానికి బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూవీపై యంగ్ హీరో ఓ క్లారిటీ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: