ఓ వైపు కరోనా మహ్మారితో ప్రజలంతా అతలాకుతలం అవుతున్నారు. మరోవైను కరువు కాటకాలతో కష్టాల్లో మునిగిపోతున్నారు. ఇలాంటి సమయంలో దక్షిణ కొరియాలో మరో దారుణం జరిగిపోయింది. దక్షిణకొరియాలో ఇచియాన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న వేర్హౌజ్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ భారీ అగ్ని ప్రమాదంలో 25 మంది అక్కడిక్కడే సజీవదహనం అయ్యారు. నిర్మాణం జరుగుతున్న సమయంలో అనుకోని పేలుడు సంఘటన జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. గాయపడ్డవారి కోసం రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు.
అయితే ఈ అగ్ని ప్రమాదం ఎలా సంబవించింది.. ఇంకా ఎవరైనా ఇందులో ఉన్నారా అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. వేర్హౌజ్ బిల్డింగ్లో జరిగిన ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది... షార్ట్ సర్క్యూట్ వల్లనా లేదా మరో కారణం వల్ల జరిగిందా అన్న విషయంపో పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా ఈ ప్రమాదం జరిగిన చోట ఆర్తనాదాలు మిన్నంటిపోతున్నాయి.