తెలంగాణ రాష్ట్రంలో గత కొంత కాలంగా బీజేపీకి ఎనలేని సేవలు చేస్తున్న ఎంపి బండి సంజయ్ కి మంచి గౌరవం దక్కింది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ బుధవారం బాధ్యతలను స్వీకరించారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సాదాసీదాగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పరిమితంగా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. తాజాగా హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

 

ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఈ రోజు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో ‘శ్రీ బండి సంజయ్ గారికి’ నా తరుపున , జన సైనికులు మరియు జనసేన పార్టీ నాయకులూ అందరి తరుపున మనః పూర్వక శుభాకాంక్షలు’’ అని పవన్ ట్వీట్ చేశారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: