భార‌త అగ్ర‌నేత‌లు రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధానిల కోసం అత్యాధునిక టెక్నాల‌జీతో  బోయింగ్-777 విమానం సిద్ధ‌మ‌వుతోంది. ఈ విమానం కోసం రూ. 8458 కోట్లు వినియోగిస్తున్నారు. ఇందులో ప్ర‌ధానంగా మూడు ర‌కాల ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లు ఉన్నాయి. రూ. 1357 కౌంట‌ర్ క‌న్‌క‌మింగ్ ఇన్‌ఫ్రా రెడ్ సిస్ట‌మ్ కోసం,  స్పేర్ ఇంజిన్ కోసం రూ. 782 కోట్లు, ఓవ‌ర్‌హాల్‌కు రూ. 944 కోట్లు, ప్ర‌త్యేక‌ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌కు రూ.1350 కోట్లు, ఎమ‌ర్జెన్సీ మెడిక‌ల్ ట్రాన్స్‌పోర్టు సిస్టం, కాన్ఫ‌రెన్స్‌ ఉబేర్ సేఫ్ డిఫెన్స్ సిస్ట‌మ్‌, క్షిప‌ణి హెచ్చ‌రిక సెన్సార్లు ఏర్పాటు చేయ‌డానికి రూ. 2650 కోట్లు కేటాయిస్తున్నారు. మ‌రికొన్ని ప్ర‌త్యేక ఏర్పాట్ల కోసం మిగ‌తా నిధులు కేటాయిస్తున్నారు. అయితే.. విమానాకి ఇన్నివేల కోట్లు అవ‌స‌ర‌మా..? అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. కానీ.. ప్ర‌స్తుత కాలంలో భార‌త అగ్ర‌నేత‌ల‌కు ఎంతో ర‌క్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. శ‌త్రువుల నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు బోయింగ్‌-777 లాంటి విమానం చాలా అవ‌స‌ర‌మ‌ని అంటున్నారు. భార‌త అగ్ర‌నేత‌ల‌కు రక్ష‌ణ క‌ల్పించ‌డ‌మంటే.. భార‌త్‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డ‌మేనని చెబుతున్నారు. 

 

ప్ర‌స్తుతం బోయింగ్ 747 విమానాన్ని భార‌త ప్ర‌భుత్వం వినియోగిస్తోంది. ఇందులోనే రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని ప్ర‌యాణిస్తుంటారు. అయితే.. దీని స్థానంలో బోయింగ్-777 విమానాన్ని తీసుకొస్తున్నారు.  ఇది అత్యంత సాకేంతిక విలువ‌ల‌తో కూడుకుని ఉండే క‌స్ట‌మ్ మేడ్ విమానట‌.  ప్ర‌స్తుతం ఉన్న బోయింగ్-747 విమానాన్ని సాధార‌ణ పైల‌ట్లు న‌డిపుతున్నారు. అయితే.. ఇప్పుడు రాబోయే బోయింగ్-777 విమానాన్ని మాత్రం ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ పైల‌ట్లు న‌డుప‌నున్నారు. ఇందులో కోసం ఐదుగురు పైల‌ట్ల‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇస్తున్నారు. దీంట్లో కౌంట‌ర్ ఇన్‌క‌మింగ్ ఇన్‌ఫ్రారెడ్ సిస్ట‌మ్‌, సెల్ఫ్ ప్రొటెక్ష‌న్‌, యాంటీ క్షిప‌ణి‌, కంట్రోల్ ఇంట‌ర్‌సేఫ్ యూనిట్‌, ఎమ‌ర్జెన్సీ మెడిక‌ల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్ట‌మ్ ఇలా అనేక అత్యంత ఆధునిక టెక్నాల‌జీతో ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను ఇందులో పొందుప‌ర్చుతున్నారు. రానున్న రోజుల్లో భార‌త అగ్ర‌నేత‌ల‌కు మ‌రింత ర‌క్ష‌ణ క‌ల్పించ‌డానికే బోయింగ్-777 విమానాన్ని సిద్ధం చేస్తున్న‌ట్లు విశ్లేష‌కులు చెబుతున్నారు. శ‌త్రువుల‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌కుండా ఉండేందుకే బోయింగ్-777 విమానాన్ని రెడీ చేయిస్తున్నారు. ఇక ఈ విమానం 2022లో అందుబాటులోకి రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: