బాలీవుడ్‌లో నిన్న‌టి త‌రం లెజెండ్రీ హీరో రిషీక‌పూర్ ఇక‌లేరు. దాదాపు రెండున్న‌ర ద‌శాబ్దాలుగా వెండితెర‌పై ఓ వెలుగు వెలిగిన ఆయ‌న అప్ప‌ట్లో అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా ఉన్నారు. ఇప్ప‌ట్లో మ‌న తెలుగు స్టార్ హీరోలు అయిన సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ అంటే అమ్మాయిలు ఎంత ప‌డిచ‌చ్చేవాళ్లో అప్ప‌ట్లో రిషీ అంటే అంత‌గా మైమ‌ర‌చిపోయే వారు. 

 

డింపుల్ క‌పాడియాతో క‌లిసి బాబితో తొలి సినిమాలో న‌టించిన ఆయ‌న తొలి సినిమాతోనూ సూప‌ర్ పాపుల‌ర్ అయ్యారు. ఆ సినిమాతోనే ఆయ‌న‌కు ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ వ‌చ్చింది. ఇక రిషీ అల‌నాటి బాలీవుడ్ న‌టుడు మేటి న‌టుడు అయిన రాజ్‌క‌పూర్ రెండో త‌న‌యుడు ఈ రిషీక‌పూర్‌. ఇక అల‌నాటి మేటి అందాల తార శ్రీదేవితో కూడా ఆయ‌న చాందిని సినిమాలో న‌టించారు.

 

ఈ ఇద్ద‌రి జంట తెర‌మీద క‌నిపిస్తే సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్టే. చాందిని సినిమాలో చాందిని ఒమేరా చాందిని పాట‌ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో శ్రీదేవితో క‌లిసి ఆయ‌న వేసిన స్టెప్పులు ఎప్ప‌ట‌కీ మ‌ర‌వ‌లేం. ఇక బాబి సినిమాను అప్ప‌ట్లో యువ‌త ఎన్నిసార్లు చూసేవారో లెక్క‌లేద‌ని ప్ర‌ముఖ సినీన‌టుడు ముర‌ళీమోహ‌న్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: