బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు రిషీ కపూర్ ఈ ఉదయం ముంబాయిలోని హెచ్.ఎన్. రిలయన్స్ హాస్పిటల్ కన్నుమూశారు. నిన్న విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త మరువక ముందే.. నటుడు రిషీ కపూర్ కన్నమూయడం బాలీవుడ్ ఇండస్ట్రీలని షాక్ లో ముంచింది. 67 ఏళ్ల వయస్సులోనే రిషీ కపూర్ తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. 2018 నుంచి ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.
ఈ క్రమంలో ఆయన కొంత కాలం చికిత్స తీసుకున్నాడు. కాగా, రిషి కపూర్ 1973లో బాబీ సినిమాతో రుషి కపూర్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. దివానా, కాదల్, లైలా మజ్నూ, చాందినీ లాంటి సినిమాలను ఆయన చేశారు. 1980లో హీరోయిన్ నీతూ సింగ్ను పెళ్లి చేసుకున్నారు. 51 సినిమాల్లో నటించిన ఆయన 41 మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. రిషికపూర్ మరణంతో బాలీవుడ్ శోఖసంద్రంలో మునిగిపోయింది.
తాజాగా రిషీ కపూర్ మరణం పై పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. రిషీ కపూర్ గొప్ప నటుడు మాత్రమే కాదని, మంచి మనిషి అని ఆయన పేర్కొన్నారు. రిషీ కపూర్ మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు అని అన్నారు. భారతీయ సినీ జగత్తు ఓ మంచి నటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Saddened by the sudden demise of legendary actor,
— pawan Kalyan (@PawanKalyan) April 30, 2020
Sri #RishiKapoor this is a great loss for indian cinema. My heartfelt condolences to their family members. May his soul rest in peace. pic.twitter.com/EZ6ppqRFMB