బాలీవుడ్ లో ఒక్కరోజు తేడాలోనే ఇద్దరు హీరోలు కన్నుమూయడం షాక్ కి గురి చేసింది. నిన్న విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త మరువక ముందే.. నటుడు రిషీ కపూర్ కన్నమూయడం బాలీవుడ్ ఇండస్ట్రీలని షాక్ లో ముంచింది. రిషీ కపూర్ ఈ ఉదయం ముంబాయిలోని హెచ్.ఎన్. రిలయన్స్ హాస్పిటల్ కన్నుమూశారు. 2018 నుంచి ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.  1970 చిత్రం మేరా నామ్ జోకర్ చిత్రంలో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు.  ముక్కుసూటిగా మాట్లాడే రిషి కపూర్ అప్పట్లో అమ్మాయిలకు కలల రాజుగా వెలిగిపోయాడు.

 

బాబీ చిత్రంలో డింపుల్ కపాడియాతో రోమాన్స్ ఇప్పటికీ యుత్ ని ఆకర్షిస్తుంది. దివానా, కాదల్, లైలా మజ్నూ, చాందినీ లాంటి సినిమాలను ఆయన చేశారు. 1980లో హీరోయిన్ నీతూ సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు.  ఆయన మృతిపట్ల సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.  బాలీవుడ్ లో ఏక కాలంలో ప్రముఖ నటులు కన్నుమూయడం నిజంగా షాక్ కి గురి చేసిందని అంటున్నారు.  రిషికపూర్ మరణంతో బాలీవుడ్ శోఖసంద్రంలో మునిగిపోయింది.  

 

తాజాగా రిషీ కపూర్ మరణంతో టాలీవుడ్ సైతం శోక సంద్రంలో మునిగిపోయింది. పలువురు నటులు ఆయనకు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో మెగా హీరో సాయిదరమ్ తేజ్ స్పందించారు.  ఎంతోమంది యువ హీరోలకు రోల్ మోడల్ గా ఉన్న రిషీ కపూర్ గారు కన్నుమూయడం షాక్ కి గురి చేసిందని.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: