వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ ఖాతా ద్వారా చంద్రబాబును టార్గెట్ చేసి ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయసాయి తన ట్వీట్లో కరోనా వైరస్ ఎన్నిరకాలుగా సోకుతుందో అంతుచిక్కడం లేదని అన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రపంచంలో చోటు చేసుకునే ప్రతి పరిణామం తనకు మాత్రమే తెలుసని అనుకుంటాడని... సైకాలజీలో హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్ అని పిలిచే మానసిక రుగ్మతతో చంద్రబాబు బాధ పడుతున్నాడని చెప్పారు. 
 
బాబు మానసిక వ్యాధులలో ఇది కూడా ఒక తీవ్ర సమస్యే అని పేర్కొన్నారు. మరో ట్వీట్లో కరోనాను కంట్రోల్ చేసే స్విచ్చే తమ దగ్గరుందని విజయసాయిరెడ్డి అన్నారు. కరోనా మా దరిదాపుల్లోకి కూడా రాదని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ ప్రధాని చెప్పినా మాస్క్ కట్టుకోమని చెబుతూ సవాల్ విసురుతున్నారని... ఆ వింతను కూడా చూడాలనుకుంటున్నానని పేర్కొన్నారు. మనకు మాస్క్ జీవితంలో భాగమవుతుందని మోదీగారు చెప్పడాన్ని కూడా చంద్రబాబు తప్పుబడుతున్నారని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: