ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషీకపూర్ మృతి చెందడంతో బాలీవుడ్, టాలీవుడ్ నటులేకాదు.. అనేక మంది రాజకీయ ప్రముఖులు కూడా తీవ్ర దగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ తరం.. ఇతరం అభిమానులను సంపాదించుకున్న అరుదైన నటుడు రిషీకపూర్. ఆయనతో ఉన్న అనుబంధాన్ని, ఆయన సినిమాలు, నటనను గుర్తు చేసుకుంటున్నారు. అద్భుతమై నటుడిని కోల్పోయామంటూ కంటతడిపెడుతున్నారు. టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కూడా రిషీకపూర్కు వీరాభిమాని. ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టమట. రిషీకపూర్ మరణవార్త తెలియగానే విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా అభిమాన నటుడి గురించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రుషీకపూర్ నటించిన కార్జ్ సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని, అలాగే.. ఓం శాంతి ఓం పాటకూడా చాలా ఇష్టమని ట్విట్టర్లోపే పేర్కొన్నారు. రుషీకపూర్ ఎంతో మానవీయత కలిగిన మనిషి అని, ఇతర స్టార్హీరోల మాదిరిగాకాకుండా సామాజిక దృక్పథంతో ఉండేవారని గుర్తు చేసుకున్నారు. కాగా, క్యాన్సర్తో బాధపడుతున్న రిషీకపూర్ ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే.
Sad to know demise of rishi kapoor natural actor and condolences to family. His movie KARZ is one of my favourite and also song OM SHANTI OM. His legacy stay on and also he is social individual concerned what is happening around unlike many stars pic.twitter.com/y8mTf7ZsyS
— Boora narsaiah goud (@narsaiah) April 30, 2020