నిన్నటి తరం బాలీవుడ్ లెజెండ్రీ నటుడు రిషీ కపూర్ ఆకస్మిక మరణంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. భార్య, కుమార్తె, తనయుడు శోక సంద్రంలో మునిగారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న పలువురు సినీ.. రాజకీయ అభిమానులు రిషీ కపూర్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. ఇక రిషీని చివరి సారి చూసేందుకు ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు రిషీ ఇంటికి రావాలని అనుకుంటున్నా లాక్డౌన్ నేపథ్యంలో కుదరని పరిస్థితి.
మరోవైపు రిషీ కుటుంబ సభ్యులు సైతం ప్రభుత్వ నిబంధనలు ఎవ్వరూ అతిక్రమించవద్దని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే రిషి జీవితంలో కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అవి ప్రస్తావించడం సమయం ప్రకారం సరైందేనా ? అన్నది పక్కన పెడితే సల్మాన్ ఖాన్ మరదలు సోహైల్ ఖాన్ భార్య సీమా ఆలీఖాన్తో ఆయన తప్పుగా బిహేవ్ చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ పెళ్లిలో ఈ సంఘటన జరిగింది. ఆ వెంటనే రిషీ వెళ్లిపోవడంతో ఈ వివాదానికి ఫుల్స్టాప్ పడింది. అప్పట్లో మహారాష్ట్రలో బీఫ్ బ్యాన్పై స్పందించిన రిషీ ఇది బ్యాన్ చేయడం నాన్సెన్స్ అంటూ కామెంట్ చేశాడు.
సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో తీర్పు తర్వాత కపూర్స్ ఎప్పుడూ ఖాన్స్కు మద్దతుగా ఉంటారని ట్వీట్ చేశారు. ఇది కూడా వివాదం అయ్యింది. హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియన్ ఉల్లిగడ్డల బస్తాతో పోలుస్తూ ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది. అలాగే ఆశిన్ - రాహుల్ శర్మ పెళ్లిలో సైతం ఆయన రచ్చ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. చివరకు రాహుల్ శర్మ సెలబ్రేషన్స్ నిలిపివేసి అక్కడ నుంచి రిషీ వెళ్లాక ఫంక్షన్ చేశారన్న టాక్ ఉంది.
#RishiKapoor bobby hindi version telugu prekshakula apoorva aadaranatho 100 days aadadam visesham. #RIPRishiKapoor pic.twitter.com/yP5xYjHgl4
— BARaju (@baraju_SuperHit) April 30, 2020