బాలీవుడ్ లో విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణంతో అంతా శోఖ సంద్రంలో ఉండగానే మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. ప్రముఖ నటుడు రిషీ కపూర్ ఈ ఉదయం ముంబాయి ఆసుపత్రిలో కన్ను మూశారు. 2018 నుంచి ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.ఈ క్రమంలో ఆయన కొంత కాలం చికిత్స తీసుకున్నాడు. ఇక రిషీ కపూర్ తనయుడు రణ్బీర్ కపూర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే బాలీవుడ్ లో కొన్నాళ్లుగా అందాల భామ అలియా భట్తో డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి.
అలియా- రణ్భీర్ రిలేషన్పై రిషీ చాలా సార్లు పాజిటివ్గానే స్పందించారు. ఇదిలా ఉంటు రిషీ కపూర్ కి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వీరిద్దరి వివాహం త్వరలో జరగబోతుందని ఇటీవల తెగ వార్తలు కూడా వచ్చాయి. చివరికి తన తనయుడి వివాహం చూడకుండానే రిషీ కపూర్ అనంత లోకాలకి వెళ్లడం ప్రతి ఒక్కరికి కంట తడి పెట్టిస్తుంది. అయితే రిషీ కపూర్ మరణ వార్త వినగానే అలియా భట్ వెంటనే తన రేంజ్ రోవర్ కారులో ముంబైలోని హెచ్ ఎన్రియలన్స్ ఫౌండేషన్ హాస్పిటల్కి చేరుకుంది.