IHG

రాజధానిలో వీకెండ్ వస్తే చాలు పోలీసులు తప్పకుండా డ్రంక్ అండ్  డ్రైవ్ టెస్ట్ లు చేస్తూ ఉంటారు. మందు బాబులను  గుర్తించేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు ఈ పరీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే ఇప్పటివరకు వాహనదారులకు మాత్రమే నిర్వహించేవారు ఇకపై ఈ టెస్టులను విమానాలు నడిపే వారికి కూడా నిర్వహించనున్నారు. అయితే ఎయిర్  లైన్స్ లో  పైలట్స్ కు  విమాన సిబ్బంది కి, ఎయిర్ కంట్రోల్  స్టాఫ్ కు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు. దీనితోపాటుగా డ్రగ్ సంబంధిత పరీక్షలు నిర్వహించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ రూల్స్ ను దేశంలో ఉన్న  మేజర్ ఎయిర్పోర్టులో అక్టోబర్ 30 నుంచి అమలు చేయనున్నారు.

 

IHG

 

డీజీసీఏ  కొత్త రూల్స్ ప్రకారం ఎవరైనా ఆల్కహాల్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన ఎడల,  టెస్ట్ లకు వ్యతిరేకించినా... తప్పించ చూసినా  సదరు వ్యక్తిని ఉద్యోగం నుంచి తప్పించడమే కాకుండా లైసెన్స్ మూడు నెలల పాటు సస్పెండ్ చేయనున్నారు. అదేవిధంగా రెండవసారి పట్టుబడినచో సమాచారం కాలంపాటు డీజీసీఏ సస్పెండ్ చేయనుంది. ముంబై ,ఢిల్లీ, చెన్నై, బెంగళూరు,  హైదరాబాద్, అహ్మదాబాద్, గౌహతి, లక్నో ,కొచ్చిన్, ఎయిర్ పోర్ట్ లో ఈ నిబంధనలు అక్టోబర్ 30వ తారీకు నుంచి అమలు కానున్నాయి భారతదేశంలోని మిగతా 33 విమానాశ్రయా లకు నెంబర్ 31కి  అమలు చేస్తాయని డీజీసీఏ పేర్కొంది. అవేంటంటే జైపూర్ త్రివేండ్రం భువనేశ్వర్ ఇండోర్ పాట్నా అమృత్సర్ గోపాల్ ఫోర్ భరత్ కోయంబత్తూరు లలో పైనుంచి అమలుచేయాలి చేస్తాయని మరియు చివరగా మిగిలిన ఎయిర్పోర్టులో డిసెంబర్ 31కి అమలు చేస్తారని వెల్లడించింది. పైలెట్లు, ఎయిర్ హోస్ట్ లు ,ట్రాఫిక్ కంట్లోలర్స్ లకు  తొలిదశలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. కాగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లకు సంబంధించి నిబంధనలను  డీజీసీఏ ఖరారు చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: