నేడు అంతర్జాతీయ కార్మికు దినోత్సవం. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని కార్మికలోకానికి, శ్రమజీవులందరికీ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కాంక్షించారు. కొవిడ్19 నియంత్రణకు ప్రతిఒక్కరూ సహకరించాలని గవర్నర్ కోరారు. జాతినిర్మాణంలో, నాగరికతా వికాసంలో కార్మికుల చెమట, రక్తం ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. యావత్ సమాజం కార్మికవర్గానికి అండగా నిలువాల్సిన తరుణమిదని పిలుపునిచ్చారు.
లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో వలస కార్మికుల కడుపు నింపేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుచేసిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చెప్పారు. కార్మికుల వేతనాలు చెల్లించాలని ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీచేసిందన్నారు. కార్మిక సోదరులకు ఆయన ‘మే డే’ శుభాకాంక్షలు తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణలో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. ప్రతీ ఒక్కరికి 12 కిలోల బియ్యంతోపాటు రూ.5 రూపాయలు అందించి, వారికి భరోసా ఇచ్చారు. వారికి అడుగడుగునా అండగా నిలిచారు.