కుల, మత, జాతి, ప్రాంతీయ భేదాలు మరచి ప్రపంచం మొత్తం జరుపుకునే ఏకైక వేడుక మే డే.  నేడు మేడే సందర్భంగా ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్మిక  శుభాకాంక్షలు తెలిపారు.   ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు. ఈ సందర్భంగా ‘‘కార్మికుల శ్రమ దేశ సంపద సృష్టికి మూలం. కార్మికుల స్వేదం, రక్తంతోపాటు వారి జీవితాలను ధారబోయడం వల్లే ప్రపంచ పురోగతి, ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధ్యమవుతోంది. మే ఒకటో తేదీ కార్మిక  పోరాట స్ఫూర్తి, చైతన్యానికి ప్రతీక. మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కార్మికులకు శుభాకాంక్షలు" అని జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఇబ్బంది ఉండటంతో నేడు మేడే హంగు, ఆర్భాటాలు లేకుండా కార్మికులు జరుపుకుంటున్నారు. ఇక దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేల మంది పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలకు తెగించిన మన పరిసర ప్రాంతాలు శుభ్రం చేస్తున్నారు.  అందుకోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు వీరికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: