మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ఊరట కలిగింది. ఓ వైపు రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మరోవైపు పదవీ గండంతో ముఖ్యమంత్రి సతమతవుతున్నారు. ఈక్రమంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థా నాలకు ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మే 28లోపు ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా ఎన్నికలను వాయిదా వేస్తూ గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను సవరించింది. దీంతో ఠాక్రే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేందుకు మార్గం సుగమం అయ్యింది.
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించాలని కోరుతూ గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ ఈసీకి లేఖ రాశారు. దీంతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా గత ఏడాది నవంబర్ 28న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆయన శాసనసభకు గానీ, మండలికిగానీ ఎన్నిక కాలేదు. మే 28 నాటికి ఆరు నెలల సమయం ము గియనుంది. ఈనేపథ్యంలో ఠాక్రేను మండలికి నామినేట్ చేయాలని కోరుతూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేసింది. దీంతో రాష్ట్రంలో ఉన్న తొమ్మది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ద్వారా ఠాక్రే మండలికి ఎన్నిక కానున్నారు.