ఒక వాక్కు ఒక హ‌క్కు నిరంత‌ర నినాదాల హోరులో వినిపించే జీవులు.. నేల నుంచి నింగి వ‌ర‌కూ విస్త‌రించే శక్తు లు మీరు.. హ‌క్కుల కోసం త్యాగాల‌కు సైతం  వెర‌వ‌ని మీ ధీర‌త‌కు వంద‌నాలు చెల్లిస్తున్నాను అంటూ యువ ఎంపీ కింజ‌రాపు రా మ్మోహ‌న్ నాయుడు ప్ర‌ముఖ సామాజిక మాధ్య‌మాల ద్వారా మేడే సందేశం అందించారు. శ్రామిక లోక సౌభాగ్య‌మే ధ్యేయం అని  చెబుతూ ... వెట్టిచాకిరీపై గర్జించిన రోజు..రక్తం చిందించి హక్కులు సాధించుకున్న రోజు..పోరాడితే పోయేదేమిలేదు బానిస సంకెళ్లు తప్ప అంటూ నినదించి గెలిచిన రోజు..కార్మిక కర్షకలోకానికి బానిస సంకెళ్లు తెగనరికిన అమరవీరులకు జోహార్లర్పిస్తూ..యావత్ కార్మికులకు..మేడే శుభాకాంక్షలు...అని పేర్కొంటూ త‌న సంక్షిప్త సందేశాన్ని ముగించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: