గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో గుంటూరు నగరంలో లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు.  ఇవాళ కొత్తగా 19 పాజిటివ్ కేసులు రావడంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.  ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 306కి పెరిగింది. ఇప్పటివరకు 8 మంది చనిపోగా, 97 మంది కోలుకున్నారు. గత కొంత కాలంగా కర్నూల్, గుంటూర్, కృష్ణలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా కర్నూల్ తర్వాత ఎక్కువగా గుంటూర్ లో కేసుల బాగా నమోదు అవుతున్నాయి.

 

గుంటూర్ రెడ్ జోన్ లో ఉన్నందున అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 21 రోజుల పాటు ఒక్క పాజిటివ్ కేసు కూడా లేకపోతే రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్ కు వెళుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు. గుంటూరు పట్టణం మొత్తం రెడ్ జోన్ లో ఉందని వెల్లడించారు. రెడ్ జోన్ లో ఉన్నందున అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయితే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నిరాధారమైన వార్తలు వస్తున్నాయని, ఓ వ్యక్తి కరోనా పాజిటివ్ తో మరణిస్తే అతడ్ని దహనం చేయాల్సి వచ్చిందని, దానిపై కొందరు మతపెద్దలు సంప్రదిస్తే వారికి తగిన వివరణ ఇచ్చామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: