దేశ‌వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఎంతో ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తోన్న లాక్‌డౌన్‌ను మ‌రో రెండు వారాలు పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. మే 3వ తేదీతో లాక్‌డౌన్ ముగుస్తోన్న నేప‌థ్యంలో కొన్ని రాష్ట్రాల్లో కేసులు, మ‌ర‌ణాల తీవ్ర‌త దృష్ట్యా లాక్‌డౌన్ పొడిగించాల‌ని సీఎంలు నిర్ణ‌యం తీసుకున్నారు. కొంద‌రు ముఖ్య‌మంత్రులు మాత్రం ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఇబ్బంది లేకుండా కొన్ని ప్రాంతాల‌కే ఇది ప‌రిమితం చేయాల‌ని అనుకున్నారు. అయితే కేంద్ర హోం శాఖ చాలా మంది అంచ‌నాలు త‌ల్ల‌కిందులు చేస్తూ మ‌రో రెండు వారాల పాటు లాక్‌డౌన్ పొడిగిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇక ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ రేపు జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. మోదీ ప్ర‌సంగంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: