చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటికి చుట్టుకుంది.  ఒకటి కాదు రెండు కాదు లక్షల్లో మరణాలు.. కేసులు నమోదు అవుతున్నాయి.  అయితే చైనాలోని పుహాన్ లో ఈ కరోనా పుట్టుక ఎలా మొదలైందన్న విషయంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అత్యంత ప్రమాదకారి అయిన కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి లాలాజలం తుంపర్ల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని ప్రపంచ వ్యాప్తంగా పలువురు నిపుణులు చెబుతున్నప్పటికీ, గాలి ద్వారాను వ్యాపించే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి.  మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు ఇప్పుడు కరోనా మహ్మారి మరోసారి విజృంభిస్తుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

 

పుహానో లో వస్తున్న వార్తలను నిజం చేసేలా చైనాలోని వుహాన్‌లో గాలిలోని తుంపర్లలోనూ వైరస్ జాడలను గుర్తించారు.  పుహాన్ లోని రెండు ఆసుపత్రులలోని గాలిలోని తుంపర్లలో వీటిని గుర్తించినట్టు నేచర్ పత్రికలో ప్రచురితమైన కథనం కలకలం రేపుతోంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో వుహాన్‌లోని రెన్మిన్ ఆసుపత్రితోపాటు కోవిడ్ బాధితులను క్వారంటైన్ చేసిన తాత్కాలిక కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు గాలి నమూనాలను సేకరించారు.

 

గాలి నమూనాలను సేకరించి విశ్లేషించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి గాలి నమూనాల్లో కరోనా వైరస్ జాడలను గుర్తించారు. ఆసుపత్రుల్లో జనం ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలు, ఐసోలేషన్ వార్డులు, బాధితుల గదులు, గాలి సరిగా ఆడని మరుగుదొడ్లలోని గాలిలో కొద్ది స్థాయిలో వైరస్ జాడలు ఉన్నట్టు గుర్తించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: