ప్ర‌పంచంలో వివాహేత‌ర సంబంధాల వ‌ల్ల ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నా.. ఎన్నో కాపురాలు కూలుతున్నా.. ఎంతో మంది చనిపోతున్నా ఈ అక్ర‌మ సంబంధాలు మాత్రం ఆగ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే కేర‌ళ‌లోని పాల‌క్క‌డ జిల్లాలో ఓ బ్యూటీషియ‌న్ దారుణ హ‌త్య‌కు గురైంది. కొల్లామ్ జిల్లాకు చెందిన ఓ బ్యూటీషియ‌న్ వ‌య‌స్సు 42 సంవ‌త్స‌రాలు. ఆమె ఇటీవ‌ల తాను ప‌నిచేసే బ్యూటీషియ‌న్ సెంట‌ర్లో సెల‌వు కావాల‌ని అడిగింది. అయితే లాక్‌డౌన్ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి ఆమె తిరిగి రాలేదు. దీంతో కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న‌తో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

 

పోలీసుల విచార‌ణ‌లో ఆమె ఓ అబ్బాయితో స‌న్నిహితంగా ఉంటున్న‌ట్టు తేలింది. మనాలీకి చెందిన కీ బోర్డు ప్లేయర్ ప్రశాంత్ (32) సోషల్ మీడియా ద్వారా సుచిత్రకు పరిచయం అయ్యాడు. వీరిద్దరి మధ్య కొంత కాలంగా ప్రేమాయణం సాగుతున్నట్లు పోలీసులు గమనించారు. సుచిత్ర ప్ర‌శాంత్‌ను పెళ్లి చేసుకోవాల‌ని ఒత్తిడి చేస్తూ వ‌స్తోంది. ఎలాగైనా ఆమెను వ‌దిలించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న ప్ర‌శాంత్ ఆమె మెడ‌కు వైరు బిగించి చంపేశాడు. అనంత‌రం శ‌వాన్ని త‌న ఇంట్లోనే పాతిపెట్టాడు.

 

పోలీసులు ప్ర‌శాంత్‌ను త‌మ‌దైన స్టైల్లో విచారించ‌గా అస‌లు నిజం ఒప్పుకున్నాడు. తానే సుచిత్రను చంపినట్లు…తాను రెంట్‌ ఉంటున్న ఇంట్లో పాతిపెట్టినట్లు చెప్పాడు. దీంతో శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు… అతన్ని అరెస్టు చేశారు. ఏదేమైనా త‌న‌క‌న్నా ప‌దేళ్లు  చిన్న‌వాడైన అబ్బాయి ప్రేమ ఈ బ్యూటీషియ‌న్ జీవితాన్ని అర్దాంత‌రంగా క్లోజ్ చేసేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: