ఒకప్పుడు దూరదర్శన్ లో సంచలనాలు సృష్టించిన రామాయణం, మహాభారత్ లాంటి సీరియల్స్ లాక్ డౌన్ సందర్భంగా మరోసారి దూరదర్శన్ లో ప్రసారం అవుతున్నాయి. ఒకప్పటి పౌరాణిక సీరియళ్లు రామాయణం, మహాభారతాలను దూరదర్శన్ పునః ప్రసారం చేస్తోన్న నేపథ్యంలో ఆ ఛానెల్‌ టీఆర్‌పీ అమాంతం పెరిగిపోయింది. ఒకదశలో ప్రైవేటు ఛానెళ్లకు పోటీగా నిలుస్తోంది.  ఈ నేపథ్యంలో ఇప్పుడు బుల్లితెరపై అలనాటి ‘శ్రీ కృష్ణ’ సీరియల్ ప్రసారం కాబోతుంది.  ఈ నేపథ్యంలోనే మరో ఇతిహాస కావ్యం శ్రీకృష్ణ సీరియల్‌ను ఆ ఛానెల్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.

 

ఈ సీరియల్‌ రేపటి నుంచే ప్రసారమవుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ రోజు ప్రకటించారు. ఒకప్పుడు డీడీ నేషనల్‌లో ప్రసారమైన పాప్యులర్ సీరియళ్లలో ఒకటైన శ్రీకృష్ణను రేపటి నుంచి ప్రతి రోజు రాత్రి 9 గంటలకు ప్రసారం చేస్తున్నాం' అని జవదేకర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. రామానంద సాగర్ దర్శకత్వం వహించిన శ్రీకృష్ణ 1993 నుంచి 1996 వరకు దూరదర్శన్‌లో ప్రసారమైంది. రామాయణం, మహాభారతం వంటి సీరియళ్లు డీడీ నేషనల్‌లో రికార్డు స్థాయిలో రేటింగ్స్ సాధిస్తోన్న విషయం తెలిసిందే. శ్రీకృష్ణకు కూడా అదే స్థాయిలో ఆదరణ వస్తుందని భావిస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: