టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మ‌హ‌ర్షి. గ‌తేడాది మే 9వ తేదీన తెర‌కెక్కిన ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు మ‌హేష్ కెరీర్‌లోనే మంచి సినిమాగా మిగిలిపోయింది. కార్పొరేట్ వ్య‌వ‌సాయం కాన్సెఫ్ట్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది. ఇక ఈ సినిమా ఇప్ప‌టికే బుల్లితెర‌పై ఐదుసార్లు టెలీకాస్ట్ అయ్యింది. తొలిసారి టెలీకాస్ట్ అయిన‌ప్పుడు ఈ సినిమాకు అంత రేటింగ్ రాలేదు. ఇక ఆ త‌ర్వాత టాప్ రేటింగ్‌లు వ‌చ్చి అంద‌రికి షాక్ ఇచ్చింది. 

 

తాజాగా ఐదోసారి బుల్లితెర‌పై టెలీకాస్ట్ అయిన మ‌హ‌ర్షికి అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. జెమినీ ఛానెల్లో గ‌త ఆదివారం టెలీకాస్ట్ అయిన మ‌హ‌ర్షి అర్బన్ మరియు రూరల్ గా 8.8 టీఆర్పీ రేటింగ్ రాగా ఒక్క అర్బన్ లోనే 10.20 రేటింగ్ వచ్చింది. దీనితో ఈ వారంలో టెలికాస్ట్ ఆయిన అన్ని సినిమాలలో ఈ సినిమా రేటింగే అత్యధికం అని తెలుస్తుంది. బుల్లితెర మీద అది కూడా ఐదోసారి టెలీకాస్ట్ అయిన‌ప్పుడు ఈ రేంజ్‌లో టీఆర్పీ రేటింగ్ రావ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఏదేమైనా మ‌రోసారి మ‌హేష్‌బాబు స్టామినా ఏంటో ఈ సారి ఫ్రూవ్ అయ్యింద‌నే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: